![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/Pandita_Ramabai_Sarasvati_1858-1922_front-page-portrait.jpg/640px-Pandita_Ramabai_Sarasvati_1858-1922_front-page-portrait.jpg&w=640&q=50)
పండిత రమాబాయి
భారతీయ సామాజిక సంస్కర్త / From Wikipedia, the free encyclopedia
పండిత రమాబాయి సరస్వతి (1858 ఏప్రిల్ 23 - 1922 ఏప్రిల్ 5 ) భారతీయ సంఘ సంస్కర్త. భారతదేశంలో మహిళల విద్య, విముక్తికి మార్గదర్శకురాలు. కలకత్తా విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆమెను పరీక్షించిన తరువాత సంస్కృత పండితురాలిగా "పండిత", "సరస్వతి" బిరుదులు ప్రదానం చేసారు.[1] ఆ బిరుదులను పొందిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. 1889 నాటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన 10 మంది మహిళా ప్రతినిధులలో ఆమె ఒకరు.[2] [3] 1890 ల చివరలో పూణే నగరానికి నలభై మైళ్ల తూర్పున ఉన్న కేడ్గావ్ గ్రామంలో ముక్తి మిషన్ను స్థాపించింది[4][5]. ఈ మిషన్కు తరువాత పండిత రమాబాయి ముక్తి మిషన్ అని పేరు పెట్టారు.పండిత రమాబాయి Christan
త్వరిత వాస్తవాలు పండిత రమాబాయి, జననం ...
మూసివేయి