పంజాబీ జానపద మతం
From Wikipedia, the free encyclopedia
పంజాబీ జానపద మతం అనేది పంజాబీ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, వారు పాటించే వివిధ ఆచారాలు. ఇందులో పూర్వీకులను పూజించటం, గ్రామదేవతలను పూజించటం, ప్రాంతీయ పండగలను ఆచరించడం వంటివి ఉన్నాయి. పంజాబీ జనపద మతానికి అంబంధించి పలు తీర్థస్థలాలున్నాయి. ఇవి హిందూ, ఇస్లాం మతాలలాంటి పెద్ద మతాల సారాల కలయికగా కనిపిస్తాయి.[1] ఈ తీర్థస్థలాలలో మతసామరస్యం, ఔన్నత్యంతో జీవించిన మహానుభావులను దైవంతో సమానంగా భావించడం లాంటివి కనిపిస్తాయి. [2]