నవీన శిలా యుగం
From Wikipedia, the free encyclopedia
కొత్త రాతి యుగం [1] (లిస్టెనిను "న్యూ స్టోను ఏజి" అని కూడా పిలుస్తారు) రాతి యుగం చివరి విభాగం. ఇది సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. " ఎపిపాలియోలిథికు నియరు ఈస్టులో " వ్యవసాయం మొదటి పరిణామాలు కనిపించాయి. తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ విభాగం సుమారు 6,500 సంవత్సరాల క్రితం (క్రీ.పూ. 4500) నుండి చాల్కోలిథికు పరివర్తన కాలం వరకు కొనసాగింది. ఇది లోహశాస్త్రం అభివృద్ధి ద్వారా గుర్తించబడింది. ఇది కంచుయుగం, ఇనుప యుగంలకు దారితీసింది. ఉత్తర ఐరోపాలో కొత్తరాతియుగం క్రీ.పూ 1700 వరకు కొనసాగింది. చైనాలో ఇది క్రీ.పూ 1200 వరకు విస్తరించింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు (న్యూ వరల్డుతో సహా) " ఐరోపియన్ కాంటాక్టు " వరకు కొత్తరాతియుగం అభివృద్ధి దశలో విస్తృతంగా ఉన్నాయి.[2]
కొత్తరాతియుగం ప్రవర్తన సాంస్కృతిక లక్షణాలు, మార్పుల పురోగతిని కలిగి ఉంటుంది. వీటిలో అడవి, దేశీయ పంటలు, జంతువుల మచ్చిక చేసుకుని పెంపుడు జంతువులుగా వాడడం ఉన్నాయి.[lower-alpha 1]
కొత్తరాతియుగం అనే పదం గ్రీకు నియోసు (అంటే "కొత్త"), (లాథోసు"రాయి") నుండి వచ్చింది. దీని అర్ధం "కొత్త రాతియుగం". ఈ పదాన్ని సరు జాను లుబ్బాకు 1865 లో మూడు-కాలపరిమితి వ్యవస్థను పేర్కొనడానికి ఉపయోగించారు.[3]