![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/08/Kapilash-_Odisha.jpg/640px-Kapilash-_Odisha.jpg&w=640&q=50)
ధేన్కనల్ జిల్లా
ఒడిశా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
డెంకనల్ జిల్లా భారతదేశంలోని ఒరిస్సా పరిపాలనా విభాగం. దీని ఉత్తర సరిహద్దున కెండుజారు, తూర్పు సరిహద్దున జాజ్పూరు, దక్షిణాన కటక్, పశ్చిమ సరిహద్దున అనుగులు ఉన్నాయి. ధేన్కనల్పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయంలో దేవాలయాలు, పురావస్తు అవశేషాలు, మధ్యయుగ కోట ఉన్నాయి. మాజీ రాచరిక రాష్ట్రం ధేన్కనల్సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉత్కళ శ్రీ శ్రీ ప్రత్ప్రుద్ర దేవాకు చెందిన గజపతి మహారాజా దక్షిణ దళాల కమాండరుగా ఉన్న హరి సింగు విద్యాధర, స్థానిక అధిపతిని ఓడించి సా.శ. 1529 లో డెంకనల్, కరాములును ఆక్రమించారు. గజపతి మహారాజు అతనికి ధేన్కనల్రాజాగా పట్టాభిషేకం చేశారు. తదనంతరం 18 తరాల రాజాలు ధేన్కనల్ను పరిపాలించారు. వారు పరిపాలనా పరమైన అనేక రాజకీయ, సామాజిక-ఆర్ధిక, సాంస్కృతిక పరిణామాలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. హరి సింగు విద్యాధర ధేన్కనల్వద్ద సిధాబలరామ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. తరువాత దీనిని నృసింగ భమర్బారు పూర్తి చేశారు.[1] 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత రాజప్రతినిధి పాలనలో ఉన్న ధేన్కనల్ఇండియన్ యూనియనులో విలీనం అయ్యింది. తరువాత ఇది 1948 లో ఒరిస్సాలో కలిసిపోయింది.[2]
డెంకనల్ | ||||
---|---|---|---|---|
ఎగువన: కపిలాష్ ఆలయం దిగువన: సారంగలో అనంతశయన విష్ణువు | ||||
![]() ఒడిశా లోని ప్రాంతం | ||||
దేశం | ![]() | |||
రాష్ట్రం | ఒడిశా | |||
ప్రధాన కార్యాలయం | డెంకనల్ | |||
విస్తీర్ణం | ||||
• Total | 4,452 కి.మీ2 (1,719 చ. మై) | |||
జనాభా (2011) | ||||
• Total | 11,92,948 | |||
• Rank | 18 | |||
• జనసాంద్రత | 268/కి.మీ2 (690/చ. మై.) | |||
భాషలు | ||||
• అధికార | ఒరియా , హిందీ, ఆంగ్లం | |||
Time zone | UTC+5:30 (IST) | |||
పిన్కోడ్ | 759 xxx | |||
ప్రాంతపు కోడ్ | 6762 | |||
Vehicle registration | OR-06 / OD-06 | |||
సమీప నగరం | భువనేశ్వర్ | |||
లింగ నిష్పత్తి | 947 ♂/♀ | |||
అక్షరాస్యత | 79.41% | |||
లోక్సభ నియోజకవర్గం | డెంకనల్ | |||
విధానసభ నియోజకవర్గం | 7
| |||
శీతోష్ణస్థితి | Aw (కొప్పెన్) | |||
అవక్షేపం | 1,421 మిల్లీమీటర్లు (55.9 అం.) |
ఈ జిల్లాలో ఎక్కువ భాగం దట్టమైన అడవి, సుదూరప్రాంతం వరకు విస్తరించిన కొండలతో నిండి ఉంది. ఇవి ఏనుగులు, పులులకు నివాసంగా ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన జిల్లాలలోని ప్రధాన అటవీ ఉత్పత్తులలో కలప, వెదురు, కట్టెలు, కెండు ఆకు, ఔషధ మూలికలు, మొక్కలు ఉన్నాయి.
19 వ శతాబ్దం నుండి భారతదేశం, చాలా తూర్పు దేశాలలో వ్యాపించిన "మహిమా ధర్మం" అనే మత ఉద్యమానికి ఈ జిల్లా కేంద్రం. శీతాకాలంలో ఇక్కడ జరుపుకునే ప్రసిద్ధ పండుగ జాగరు జాత్రా (మహా శివరాత్రి) ఒకటి.