ద్విజేంద్ర నారాయణ్ ఝా
From Wikipedia, the free encyclopedia
ద్విజేంద్ర నారాయణ్ ఝా (Dwijendra Narayan Jha) ఒక వివాదాస్పద భారతీయ చరిత్రకారుడు. ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, Indian Council of Historical Research సభ్యులు. బ్రాహ్మణులు బయట పెట్టని కొన్ని వేదాల ఆధారంగా పూర్వం వైదిక బ్రాహ్మణులు ఆవు మాంసం తినే వారని, ఆవు మాంసం తినే ఆచారాన్ని భారత దేశంలో మొదత ప్రవేశ పెట్టినది ముస్లింలు కాదని వివరిస్తూ "Myth of the Holy Cow" అనే పుస్తకం వ్రాసారు. ఆ గ్రంథం వ్రాసినందుకు అతనికి చావు బెదిరింపులు కూడా వచ్చాయి. వేదాలు సంస్కృత-ప్రాకృత భాషలలో వ్రాసి ఉన్నాయి. వాటిలో కొన్ని భాగాలని మాత్రమే హిందీ, తెలుగు భాషలలోకి అనువదించడం జరిగింది. అనువాదం కాని కొన్ని వేదాలని అనువదించి అందులోని విరుద్ధ అంశాలను బయట పెట్టినందుకు హిందూత్వవాదులు అతన్ని బెదిరించడం జరిగింది. ద్విజేంద్ర నారాయణ్ ఝా కూడా బ్రాహ్మణుడే కానీ అతను బ్రాహ్మణుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇతను కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారే కానీ ఇతను హిందూత్వవాదాన్ని విమర్శిస్తూ రచనలు వ్రాసారు.