దోఆబా
From Wikipedia, the free encyclopedia
దోఅబా (పంజాబీ: ਦੋਆਬਾ), బిస్త్ దోఅబ్ లేదా జుల్లుందర్ దోఅబ్ గానూ పేరొందిన, పంజాబ్ కు చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం బియాస్, సట్లెజ్ నదుల మధ్యలో,[1] ఐదు పంజాబ్ దోఅబ్ లలో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలను ప్రాంతం పరంగా "దోఆబియా" అని పిలుస్తారు. దోఆబాలో మాట్లాడే మాండలీకాన్ని దోఅబీ అని పిలుస్తారు. దోఅబా లేక దోఅబ్ అన్న పదాలు పర్షియన్ నుంచి స్వీకరించారు. దోఆబ్ "دو آب" (దో ఆబ్ "రెండు జలాలు") అంటే రెండు నదుల ప్రాంతం అని అర్థం.[2]
దోఅబా జనాభాలో 35% షెడ్యూల్డ్ కులాలు వారు ఉన్నారు. దోఅబీలు పంజాబ్ డయాస్పోరాలో అధిక సంఖ్యాకులు కావడంతో ఈ ప్రాంతాన్ని ఎన్నారై హబ్ ఆఫ్ పంజాబ్ గా పిలుస్తారు. [3]