![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e6/Doddabettateles.jpg/640px-Doddabettateles.jpg&w=640&q=50)
దొడ్డబెట్ట శిఖరం
నీలగిరి శ్రేణిలోని ఎత్తైన పర్వతం / From Wikipedia, the free encyclopedia
దొడ్డబెట్ట శిఖరం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం. ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విస్తరించి ఉన్న నీలగిరి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమల్లో అంతర్భాగం. దొడ్డబెట్ట శిఖరం సుమారు 2,637 మీటర్ల (8640 అడుగులు) ఎత్తును కలిగి ఉంది[1]. ఈ శిఖరం ప్రసిద్ధ వేసవి విడిది అయిన ఊటికి 9 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఊటి నుండి కోటగిరికి వెళ్ళు మార్గంలో ఈ శిఖరం కనిపిస్తుంది. ఊటిని సందర్శించే ప్రకృతి ప్రేమికులు కచ్చితంగా చూసే ప్రదేశాలలో దొడ్డబెట్ట ఒకటి. తమిళనాడు పర్యాటకం వారు సూపరిండెంటింగ్ ఇంజనీరు శ్రీ గోవిందన్ సారథ్యంలో ఇక్కడ 18.06.1983లో టెలీస్కోప్ హౌస్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో సందర్శకుల కొరకు రెండు టెలీస్కోపులను ఉంచారు. టెలీస్కోప్ హౌస్ మీదికెక్కి చూస్తే, చుట్టూ కొండలు, లోయలు, ఊటి సౌందర్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుందీ ప్రదేశం. ఈ శిఖరానికి అత్యంత సమీపంలోనే దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న తేయాకు కర్మాగారం ఒకటి ఉంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Doddabetta_Peak.jpg/640px-Doddabetta_Peak.jpg)