తరన్ తారన్ జిల్లా
పంజాబ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో తరన్ తారన్ జిల్లా (పంజాబి : ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲਾ) ఒకటి. జిల్లాలో తరన్ తారన్, పట్టి పట్టణాలు ఉన్నాయి. తరన్ తారన్ సిఖ్ఖులకు పవిత్రప్రదేశం. 2006లో గురు అర్జున్ దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబు ప్రభుత్వం, అమృత్సర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచింది. పంజాబు రాష్ట్రంలో 19వ జిల్లాగా అవతరించింది. జిల్లాలో 3 తాలూకాలు (పట్టి, ఖాదూర్ సాహిబ్, తరన్ తారన్) ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పోలీస్ సూపరిండెంటు, అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, ది చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సివిల్ సర్జన్, డిస్ట్రిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇంప్రూవ్మెంటు ట్రస్ట్, మునిసిపల్ కౌన్సిల్ సహకారంతో డెఫ్యూటీ కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
త్వరిత వాస్తవాలు తరన్ తారన్ జిల్లా ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲ੍ਹਾ, దేశం ...
తరన్ తారన్ జిల్లా
ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲ੍ਹਾ | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
దేశం | India | |||
రాష్ట్రం | Punjab | |||
Named for | భవసాగరాన్ని తరింపజేసే నావ అని అర్థం | |||
ముఖ్య పట్టణం | తరన్ తారన్ సాహిబ్ | |||
Area | ||||
• Total | 2,414 km2 (932 sq mi) | |||
Population (2011)‡[›] | ||||
• Total | 11,20,070 | |||
• Density | 460/km2 (1,200/sq mi) | |||
భాషలు | ||||
• అధికారిక | పంజాబీ | |||
Time zone | UTC+5:30 (IST) | |||
అక్షరస్యత | 69.4% |
మూసివేయి