జాతీయ రహదారి 44
From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 44 భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది జమ్మూ కాశ్మీరులొని శ్రీనగర్ సరిహద్దు, తమిళనాడులొని కన్యాకుమారితొ కలుపుతుంది.[1] ఇది జమ్మూ కాశ్మీరు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[2] ఇది దేశంలో కెల్లా అత్యంత పొడవైన జాతీయ రహదారి.
National Highway 44 | |
---|---|
Map of the National Highway in red | |
మార్గ సమాచారం | |
పొడవు | 3,745 కి.మీ. (2,327 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | శ్రీనగర్, జమ్మూ కాశ్మీరు |
దక్షిణం చివర | కన్యాకుమారి, తమిళనాడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | జమ్మూ కాశ్మీర్: 304 km (189 mi) హిమాచల్ ప్రదేశ్: 11 km (6.8 mi) పంజాబ్: 279 కి.మీ. (173 మై.) హర్యానా: 257 కి.మీ. (160 మై.) ఉత్తర ప్రదేశ్: 287 కి.మీ. (178 మై.) మధ్యప్రదేశ్: 547 కి.మీ. (340 మై.) మహారాష్ట్ర: 260 కి.మీ. (160 మై.) తెలంగాణ: 533 కి.మీ. (331 మై.) ఆంధ్రప్రదేశ్: 260 కి.మీ. (160 మై.) కర్ణాటక: 135 కి.మీ. (84 మై.) తమిళనాడు: 630 కి.మీ. (390 మై.) |
రహదారి వ్యవస్థ | |
|
పాత ఏడు జాతీయ రహదారులను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ విలీనం చేయడం ద్వారా ఎన్హెచ్ 44 ఉనికి లోకి వచ్చింది. శ్రీనగర్ నుండి వచ్చే జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (పాత ఎన్హెచ్ 1A), పంజాబ్, హర్యానాల నుండి ఢిల్లీ వెళ్ళే పాత ఎన్హెచ్ 1, ఢిల్లీ నుండి ప్రారంభమై ఆగ్రాలో ముగిసే పాత ఎన్హెచ్ 2 భాగం, ఆగ్రా నుండి గ్వాలియర్ వరకు ఉన్న పాత ఎన్హెచ్ 3 (ఆగ్రా-బాంబే జాతీయ రహదారిగా ప్రసిద్ధి), ఝాన్సీ వరకు ఉండే పాత ఎన్హెచ్ 75, పాత ఎన్హెచ్ 26, లఖ్నాడన్, సియోని, నాగ్పూర్, ఆదిలాబాద్ మీదుగా, నిర్మల్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, చిక్కబల్లాపూర్, దేవనహళ్లి, బెంగళూరు, హోసూర్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, తిరునల్వేలి కన్యాకుమారి వద్ద ముగిసే పాత ఎన్హెచ్ 7 లు ఇందులో భాగమయ్యాయి.[3]