భారతదేశం లోని పాత జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
నేషనల్ హైవే 1డి ( ఎన్హెచ్ 1డి ), జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది శ్రీనగర్ను లడఖ్లోని లేహ్కు కలుపుతుంది. దీన్ని శ్రీనగర్-లేహ్ హైవే అని కూడా అంటారు. 2006 లో శ్రీనగర్-లేహ్ హైవేను జాతీయ రహదారిగా ప్రకటించారు.[1] [2] ఇది ఇప్పుడు జాతీయ రహదారి 1 లో భాగం. ఇది పశ్చిమాన ఉరి వరకు విస్తరించింది.
National Highway 1డి | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 422 కి.మీ. (262 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ | |||
శ్రీనగర్లో ఎన్హెచ్ 1ఎ | ||||
తూర్పు చివర | లేహ్, లడఖ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | జమ్మూ కాశ్మీర్: 422 కి.మీ. (262 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | శ్రీనగర్ - జోజి లా - కార్గిల్ - లేహ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
మహారాజా రణబీర్ సింగ్, థామస్ డగ్లస్ ఫోర్సిత్ ల మధ్య 1870లో [3] కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత, పాత మధ్య ఆసియా వాణిజ్య మార్గమైన శ్రీనగర్-లేహ్-యార్కండ్ను ట్రీటీ రోడ్ అని కూడా పిలుస్తారు. [4]
2010 లో, పాత ఎన్హెచ్1ఎ (ఉరి-శ్రీనగర్), పాత ఎన్హెచ్1డి (శ్రీనగర్-లేహ్) లను కలిపి కొత్తగా జాతీయ రహదారి 1ని రూపొందించారు. [5]
ఎన్హెచ్ 1డి చాలా వరకు, ప్రమాదకరమైన భూభాగం గుండా వెళ్తుంది. సింధు నది వెంబడి ఉన్న చారిత్రిక వాణిజ్య మార్గాన్ని ఇది అనుసరించింది. తద్వారా ఆధునిక ప్రయాణికులకు చారిత్రికంగా, సాంస్కృతికంగా ముఖ్యమైన గ్రామాల సంగ్రహావలోకనం ఇస్తుంది. [6] ఈ రహదారి సాధారణంగా జూన్ ప్రారంభం నుండి నవంబరు మధ్య వరకు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటుంది. ఎన్హెచ్ 1 మొత్తం పొడవు 422 కి.మీ. (262 మై.) . [7]
17, 18 శతాబ్దాలలో, ఈ రహదారి ఒక చిన్న బండ్ల బాట లాగానే ఉండేది. గుర్రాలపై పోయేందుకు కూడా కష్టంగా ఉండేది. ప్రధానంగా కాశ్మీర్ శాలువ పరిశ్రమకు అవసరమైన పాష్మినా ఉన్ని వంటి వస్తువులను, యార్కండ్, టిబెట్ ల నుండి పోర్టర్లు తీసుకువెళ్ళేవారు. [8]
19వ శతాబ్దంలో, జోరావర్ సింగ్ లడఖ్ను స్వాధీనం చేసుకున్న తర్వాత డోగ్రా పాలనలో, గుర్రాలపై వెళ్ళేలా మార్గాన్ని మెరుగుపరచారు. [8] 1870లో, జమ్మూ కాశ్మీర్ మహారాజా రణబీర్ సింగ్, బ్రిటిష్ రాజ్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ రాజ్యం, మధ్య ఆసియా సరిహద్దు (బహుశా కారకోరం పాస్ ) వరకు రహదారి నిర్వహణ చేపట్టింది. దీని కోసం వార్షిక నిధులను కేటాయించింది. ఈ రహదారికి "ట్రీటీ రోడ్" అని పేరు వచ్చింది. [8]
1950లలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా రహస్యంగా జిన్జియాంగ్ నుండి పశ్చిమ టిబెట్ వరకు, దాదాపు 1,200 కి.మీ. (750 మై.) దూరం సైనిక రహదారిని నిర్మించింది. దీన్ని 1957 లో భారతీయులు కనిపెట్టారు. 1958లో ఈ రహదారిని చూపుతున్న చైనీస్ మ్యాపులతో ఇది నిర్థారణైంది. రాజకీయ పరిస్థితులు క్షీణించాయి, 1962లో చైనా-ఇండియన్ యుద్ధంతో ఇది పరాకాష్ఠకు చేరుకుంది.
చైనా వైపు ఉన్న రహదారి చైనా సైన్యానికి నమ్మకమైన సరఫరా మార్గంగా మారింది. భారత సైన్యం కూడా తమ దళాలకు సరఫరా, సమీకరణల కోసం రహదారిని నిర్మించడానికి ఇది ప్రేరణనిచ్చింది. 1962లో శ్రీనగర్లో ప్రారంభమైన ఈ నిర్మాణం రెండేళ్లలో కార్గిల్కు చేరుకుంది. ఆధునిక శ్రీనగర్-లే హైవేకి ఇది ఆధారం. భౌగోళిక సవాళ్ళ కారణంగా ఈ రహదారిని నిర్మించడం ప్రమాదకరమైన పని. ఈ రహదారి నిర్వహణ ఇప్పటికీ సవాలే.[9]
1974లో పౌరుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేసారు.
1999 లో కార్గిల్పై పాకిస్తాన్ దురాక్రమణ చేసిన సమయంలో భారత సైన్యం ఈ రహదారిని సమీకరణ మార్గంగా ఉపయోగించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.