జగన్నాథ దేవాలయం, బరిపడ
జగన్నాథస్వామి దేవాలయం / From Wikipedia, the free encyclopedia
శ్రీ జగన్నాథ దేవాలయం (ఒరియా: ଶ୍ରୀ ଜଗନ୍ନାଥ ମନ୍ଦିର) భారతదేశంలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన మయూర్భంజ్ జిల్లాలోని బరిపడ గ్రామంలో నెలకొని ఉన్న జగన్నాథస్వామి ఆలయం. [1] జగన్నాథ అనే పదం సంస్కృత పదం నుంది ఉత్పత్తి అయినది. సంస్కృత భాషలో జగత్ అనగా విశ్వం, నాథుడు అనగా ప్రభువు. [2][3]
త్వరిత వాస్తవాలు Jagannath Temple, Baripada, భౌగోళికాంశాలు : ...
Jagannath Temple, Baripada | |
---|---|
భౌగోళికాంశాలు : | 21°55′44.98″N 86°43′23.9″E |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | Odisha |
ప్రదేశం: | Mayurbhanj |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | Hindu temple architecture |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 1 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 12 th century CE |
మూసివేయి
ఈ దేవాలయ శిఖరం పంచత్నం. ఇది ఒరిస్సా, బరిపడ లోని రెండవ శ్రీ క్షేత్రము. ఈ దేవాలయం ఒడిశా లోని అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయ రథాయాత్ర పూరి తరువాత గల పురాతన చరిత్ర కలది. ఇచట రథాయాత్రను 500 సంవత్సరాలకు పూర్వం నుండి నిర్వహిస్తున్నారు. బరిపద రథ యాత్ర యొక్క ఆచారాలు ప్రత్యేకమైనవి. సుబద్ర రాథాన్ని లాగేందుకు ఆడ భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది పొరుగు రాష్ట్రాల నుండి స్త్రీ భక్తులను ఆకర్షిస్తుంది.