చేది రాజ్యం
From Wikipedia, the free encyclopedia
" చేది " ఒక పురాతన భారతీయ యాదవ రాజ్యం. ఇది మధ్యప్రదేశు ప్రాంతాలలోని బుందేలుఖండు విభాగంలో యమునా నదికి దక్షిణాన కెను నదీ తీరంలో ఉండేది. దీని రాజధాని నగరాన్ని సంస్కృతంలో శక్తిమతి, పాలిలో సోత్తివతి-నగరా అని పిలిచేవారు.[1] పాలి భాషా బౌద్ధ గ్రంధాలలో ఇది పదహారు మహాజనపదాలలో ఒకటిగా (ఉత్తర, మధ్య భారతదేశం "గొప్ప రాజ్యాలు") జాబితా చేయబడింది.[2]
మహాభారతం ఆధారంగా చేది రాజ్యాన్ని మగధకు చెందిన జరాసంధుడు, కురుచక్రవర్తి దుర్యోధనులకు మిత్రుడైన శిశుపాలుడు పాలించాడు. ఆయన తన మామ కొడుకు అయిన వాసుదేవ కృష్ణూడికి ప్రత్యర్థి. పాండవ చక్రవర్తి యుధిష్ఠరుడు రాజసూయ యాగం సమయంలో వాసుదేవ కృష్ణుడు ఆయనను చంపాడు. భీముడి భార్య చేదికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ చేదిరాజులలో దమఘోషుడు, శిశుపాలుడు, ధృష్టకేతు, సుకేతు, సారాభా, భీముడి భార్య, నకుల భార్య కరేనుమతి, ధృష్టకేతు కుమారులు ఉన్నారు. ఇతర చేదిరాజులలో ఉపరిచర వసువు, ఆయన పిల్లలైన రాజు సుబాహు, రాజా సహజా ఉన్నారు. దీనిని ప్రారంభ కాలంలో పౌరవ రాజులు, తరువాత దేశ మధ్య భాగంలో యాదవ రాజులు పాలించారు.