చాపేకర్ సోదరులు
భారతీయ క్రియాశీలి / From Wikipedia, the free encyclopedia
చాపేకర్ సోదరులు - దామోదర్ హరి చాపేకర్ (1870-1898), బాలకృష్ణ హరి చాపేకర్ (1873-1899, బాపూరావుగా సుప్రసిద్ధుడు), వాసుదేవ్ హరి చాపేకర్ (1879-1899, వాసుదేవగా ప్రసిద్ధులు) - భారతీయ స్వాతంత్ర్యోద్యమకారులు. వారు పూణె లోని బ్రిటిష్ ప్లేగు కమీషనర్ డబ్ల్యూ.సి.రాండ్ హత్యోదంతంలో పాలుపంచుకున్నవారు.[1]
భారతదేశం ఆంగ్లేయుల పాలనలో వున్నప్పుడు బ్రిటిష్ అధికారుల నిర్లక్ష్యానికి ఎదురొడ్డి అసువులు బాసిన ఎందరో యువకుల కథలు మనకు తెలుసు. వారిలో భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్ వంటివారి గురించి చాల మందికి తెలుసు. ఆ కోవకు చెందిన వారే చాపే సోదరులు.