![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/87/Gajapati_Empire_map.svg/langte-640px-Gajapati_Empire_map.svg.png&w=640&q=50)
గజపతి వంశం
తూర్పు తీరాన్ని పాలించిన భారతదేశపు రాజవంశం (సా.శ.15 -16) / From Wikipedia, the free encyclopedia
గజపతి వంశం, 15 - 16వ శతాబ్దాలలో కళింగ (ఒడిషా) కేంద్రంగా ఉచ్ఛదశలో ఉత్తరాన మహానది నుండి దక్షిణాన కావేరీ నది వరకు తూర్పు తీరాన్ని పాలించిన భారతదేశపు రాజవంశం. గాంగ వంశం క్షీణదశలో ఉన్నప్పుడు వీరు రాజ్యానికి వచ్చారు. 110 యేళ్లే పరిపాలించినా గజపతి వంశ పాలన ఒడిషా చరిత్రలో సువర్ణాధ్యాయంగా భావిస్తారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
గజపతి రాజులు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1434–1541 | |||||||||||||
![]() 15 వ శతాబ్దం మధ్యలో గజపతి రాజులు పరిపాలన సాగించిన ప్రాంతం. [2] | |||||||||||||
రాజధాని | కటక్ | ||||||||||||
సామాన్య భాషలు | ఒడియా భాష [3] | ||||||||||||
మతం | హిందూ | ||||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||||
గజపతి | |||||||||||||
• 1434–66 | కపిలేంద్ర గజపతి | ||||||||||||
• 1467–97 | పురుషోత్తమ దేవ్ | ||||||||||||
• 1497–1540 | ప్రతాపరుద్ర దేవ్ | ||||||||||||
• 1540–1541 | కలువా దేవా | ||||||||||||
• 1541 | కాఖారువా దేవా | ||||||||||||
చారిత్రిక కాలం | మధ్యయుగ భారతదేశం | ||||||||||||
• స్థాపన | 1434 | ||||||||||||
• పతనం | 1541 | ||||||||||||
|
సూర్యవంశ గజపతులు తూర్పు గాంగ చక్రవర్తి నాలుగవ నరసింహ కాలం నుండే ప్రాముఖ్యత సంతరించుకున్నారు. ఓఢ్ర దేశంపై విజయనగర సామ్రాజ్యపు దాడులకు ప్రతిదాడులు క్షీణిస్తున్న తూర్పు గాంగులు కాక గజపతులు చేసేవారు. కపిలేంద్ర గజపతి తను సూర్వవంశానికి చెందినవాడని చెప్పుకున్నాడు. అందువలన ఈ వంశానికి సూర్యవంశ గజపతులన్న పేరు వచ్చింది. చివరి గాంగ వంశ పాలకుడు నాలుగవ భానుదేవ పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చిత పరిస్థితులలో భానుదేవుని వద్ద మంత్రిగా ఉన్న కపిలేంద్ర సూర్యవంశాన్ని స్థాపించాడు. ఈ వంశపు పాలకులను గజపతులని వ్యవహరిస్తారు. కపిలేంద్ర గజపతి ఈ వంశంలోని అత్యంత శక్తిమంతమైన రాజు. విజయనగర చక్రవర్తిని ఓడించి రాజ్యాన్ని కావేరీ తీరం దాకా విస్తరించాడు. కపిలేంద్ర తర్వాత రాజ్యానికి వచ్చిన పురుషోత్తమ గజపతి కూడా శక్తిమంతమైన రాజే కానీ ఇతని పాలనలో కళింగ ఒక్కొక్కటే తన ప్రాంతాలను కోల్పోవటం ప్రారంభమైంది. ప్రతాపరుద్ర గజపతి చివరి రోజుల్లో వంశం క్షీణించి తమ ఆధీనం ఒక్క చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది.