కువెంపు
కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత / From Wikipedia, the free encyclopedia
కుప్పళ్ళి వెంకటప్పగౌడ పుట్టప్ప (కన్నడ: ಕುಪ್ಪಳ್ಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ) ( 1904 డిసెంబరు 29 - 1994 నవంబరు 11)[1] కన్నడ భాషా రచయిత, కవి. అతను కన్నడ సాహిత్యంలో 20వ శతాబ్దానికి చెందిన అత్యంత గొప్పకవిగా గుర్తింపు పొందాడు. కన్నడం లో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన ఏడుగురిలో[2] అతను మొదటివాడు. పుట్టప్ప తన సాహిత్య రచనలన్నిటినీ కువెంపు అనే కలం పేరుతో రాసాడు. అతను రాష్ట్రకవిగా గౌరవించబడిన కన్నడ కవులలో రెండవ వాడు. (ఎం. గోవింద పాయ్ తరువాత). పురాతన భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధునిక కన్నడంలో తిరిగి రాసాడు. అతను రాసిన రచనలు శ్రీ రామాయణ దర్శనం, మహాకావ్య (ఇతిహాస పద్యాలు) ఈ యుగం సమకాలీన రూపంగా, ప్రయోగ పునరుద్ధరణగా భావించబడింది. అతను వాడిన కొన్ని పదబంధాలు, విశ్వ మానవతా వాదానికి అతను చేసిన సేవ వలన చిరస్థాయిగా నిలిచిపోయాడు. భారత ప్రభుత్వంచే అతను పద్మ భూషణ్ పురస్కారాన్ని పొందాడు. అతను కర్ణాటక రాష్ట్ర గీతమైన 'జయ భారత జననియ తనుజతే' ను రచిందాడు.
కుప్పలి వెంకటప్ప పుట్టప్ప | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1904-12-29)1904 డిసెంబరు 29 హిరెకొడిగెలో గ్రామం,కొప్ప తాలూకా, చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక |
మరణం | 1994 నవంబరు 11(1994-11-11) (వయసు 89) మైసూరు, కర్ణాటక |
కలం పేరు | కువెంపు |
వృత్తి | రచయిత, ప్రొఫెసర్ |
జాతీయత | భారత దేశము |
రచనా రంగం | ఫిక్షన్, కవిత్వం, నాటకం, వ్యాసాలు |
సాహిత్య ఉద్యమం | నవోదయ |
ప్రభావం | మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, రామకృష్ణ పరమహంస |
Website | |
http://www.kuvempu.com/ |