కుకి ప్రజలు
కుకీలు, భారతదేశం మరియు బర్మా మధ్య ప్రాంతం లోని కొండల్లో నివసించే వివిధ తెగలలో ఒకరు. / From Wikipedia, the free encyclopedia
కుకిలు [1] భారతదేశం, బంగ్లాదేశు, బర్మాలోని అనేక కొండ తెగలలో ఒకటి. మయన్మారులోని చిను రాష్ట్రంలో ఉన్న చిను ప్రజలు, భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలో మిజో వంటి అనేక టిబెటో-బర్మా గిరిజన ప్రజలు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, వాయవ్య బర్మా, బంగ్లాదేశులోని చిట్టగాంగు కొండ ప్రాంతాలలో వ్యాపించారు. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల ప్రదేశు మినహా అన్ని రాష్ట్రాలలో వీరు ఉన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లలో వీరిలా చెదరగొట్టబడడం భారతదేశ ఆక్రమణలో చేసిన బ్రిటిషు వారు చేసిన శిక్షాత్మక చర్యలకు ఇది పరాకాష్ఠగా భావించబడుతుంది.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3c/Kuki_language.png/320px-Kuki_language.png)
కుకి ప్రజల దాదాపు యాభై తెగలను భారతదేశం షెడ్యూల్డు తెగలుగా గుర్తించింది.[3] వారు ఆవిర్భవించిన ప్రాతం, వారు మాట్లాడే భాషామాండలికం ఆధారంగా వీరిని షెడ్యూల్డు తెగలుగా భారతప్రభుత్వం గుర్తించింది.
"చిను" పేరు వివాదాస్పదమైంది. భారతదేశంలో బ్రిటీషు ఆక్రమణ సమయంలో కుకిషు భాష మాట్లాడే ప్రజలను సమూహపరచడానికి బ్రిటిషు వారు 'చిన్-కుకి-మిజో' అనే సమ్మేళనం పదాన్ని ఉపయోగించారు. భారత ప్రభుత్వం దీనిని "వారసత్వంగా" పొందింది.[4] మిషనరీలుûసరిహద్దు భారత వైపున ఉన్న వారికి కుకి అనే పదాన్ని ఉపయోగించటానికి ఎంచుకున్నారు.[5][6] బర్మా చిను రాష్ట్రంలోని చిను జాతీయ నాయకులు బ్రిటను నుండి బర్మా స్వాతంత్ర్యం పొందిన తరువాత "చిను" అనే జాతిప్రజలుగా ప్రాచుర్యం పొందారు.[7]
ఇటీవలే చిను, కుకిలను తిరస్కరించి జోమి అనే పేరును ఎంచుకున్నారు. జూతో సహా చిన్న ఉత్తర కుకిషు భాషలను మాట్లాడే అనేక మందికి సాధారణంగా ఈ పేరును ఉపయోగిస్తున్నారు.[8] హ్మర్లు జూ / జో హమలు, కోమ్సు వంటి ఇతర సమూహాలు తమకు తాముగా సహకరించకపోవచ్చు.[9][10]
మిజో అనే పదం గందరగోళానికి కారణమవుతుంది (ముఖ్యంగా జోమి నేషనలు కాంగ్రెస్ ఆవిర్భావం తరువాత).[11][12]