పంజాబ్ కింగ్స్
From Wikipedia, the free encyclopedia
పంజాబ్ కింగ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో మొహాలీ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. 2008 లో ప్రారంభించబడిన ఈ జట్టుకు పేరు కింగ్స్ XI పంజాబ్ గా ఉండేది. 2021 లో దీనికి ప్రస్తుతమున్న పేరు పెట్టారు. మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింతా, కరణ్ పాల్ ఈ ఫ్రాంచైసీ యజమానులు. మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి స్వంత మైదానం. 2010 నుంచి ఈ జట్టు తమ స్వంత మైదానంలో ఆడాల్సిన ఆటలను ధర్మశాలలోని HPCA స్టేడియం లేదా, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో కూడా ఆడుతూ వస్తోంది.
దస్త్రం:Kings XI Punjab logo.svg | ||
వ్యక్తిగత సమాచారం | ||
---|---|---|
కెప్టెన్ | శిఖర్ ధావన్ | |
కోచ్ | ట్రెవర్ బేలిస్ | |
యజమాని |
| |
జట్టు సమాచారం | ||
నగరం | మొహాలీ, చండీఘడ్, పంజాబ్ | |
రంగులు | ![]() | |
స్థాపితం | 2008 (2008) | |
స్వంత మైదానం | పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలీ (సామర్థ్యం: 26,000) | |
రెండవ స్వంత మైదానం | హోల్కర్ స్టేడియం, ఇండోర్ (సామర్థ్యం : 30,000) | |
| ||
![]() |
ఈ జట్టుకు క్యాచ్ మెంట్ ఏరియా కాశ్మీర్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఈ పేర్లలోని తొలి అక్షరాలు జట్టు చిహ్నం మీద ముద్రించి ఉండటం గమనించవచ్చు.[2][3] 2014 లో రన్నరప్ గా నిలవడం తప్ప మిగతా 12 సీజన్లలో ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు.
ఈ జట్టుకు రవిచంద్ర అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా బ్రాడ్ హాగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
2021 ఫిబ్రవరి 17 న కింగ్స్ XI పంజాబ్ జట్టు పేరును పంజాబ్ కింగ్స్ గా మార్చారు.[4][5][6]