కశింకోట
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, కశింకోట మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, కశింకోట మండల గ్రామం From Wikipedia, the free encyclopedia
కశింకోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. కశింకోట శారదానది ఒడ్డున, మద్రాసు - కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డు పైన ఉంది.ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 4 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4069 ఇళ్లతో, 15753 జనాభాతో 864 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7573, ఆడవారి సంఖ్య 8180. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1457 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 221. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 586327[2].
కశింకోట | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 17°40′25″N 82°57′48″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి |
మండలం | కశింకోట |
విస్తీర్ణం | 8.64 కి.మీ2 (3.34 చ. మై) |
జనాభా (2011)[1] | 15,753 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,700/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 7,573 |
• స్త్రీలు | 8,180 |
• లింగ నిష్పత్తి | 1,080 |
• నివాసాలు | 4,069 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 531031 |
2011 జనగణన కోడ్ | 586327 |
2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం విశాఖపట్నం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[3]
కశింకోట సంస్థానపు గ్రామం. నిజాం పాలనలో చికాకోల్ సర్కారులో ఒక ఫౌజ్దారీగా ఉండేది. ఆ తరువాత 1794 నుండి 1802 వరకు విశాఖపట్నం జిల్లాగా ఏర్పడిన మూడు కలెక్టరేట్లలో ఒక కలెక్టరేటుకు ముఖ్యపట్టణంగా ఉంది.[4] 1802లో విశాఖపట్నం జిల్లా ఏర్పడిన తర్వాత అనకాపల్లి జమిందారీ తాలూకాలో భాగమైనది.మహమ్మదీయుల పాలనలో గోదావరి నదికి ఉత్తారన ఉన్న ప్రాంతంలోని కోటలలోకెల్లా పఠిష్టమైన ప్రముఖ కోటగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం కశింకోటలో కోట యొక్క శిథిలాలు మాత్రమే మిగిలాయి. 1882లో రాబర్ట్ సీవెల్ కశింకోట దుర్గం 800 యేళ్ళనాటిదని ప్రస్తావించాడు. అంటే ఈ కోట కనీసం 11వ శతాబ్దం నుండి ఉండి ఉండాలి. ఇక్కడ సదాశివరాయల కాలం నాటి రెండు శాసనాలు (1558, 1559) లభించాయి.[5] 1572లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉత్తరాంధ్రలో తన ప్రాబ్యలం పెంచుకోవటానికి రాజమండ్రి నుండి దండెత్తి కశింకోటను వశపరచుకున్నాడు. ఆ తరువాత ఒరిస్సాపై దండెత్తాడు. నామమాత్రంగా గంజాం మెత్తం గోల్కొండ సుల్తానుల ఆధీనంలో ఉన్నా బాహుబలేంద్ర కుటుంబం వారు పాలిస్తుండేవారు. ఆ తరువాత వాళ్లు రాజధానిని రాజమండ్రి నుండి కశింకోటకు మార్చారు.[6] బాహుబలేంద్ర కుమారుడు ముకుందరాజు కశింకోట రాజుగా ఉన్న కాలంలో పన్నులు కట్టడానికి నిరాకరించాడు. కుతుబ్షా దండెత్తి రాగా, వేంకటాపతి రాయలును సహాయం కోరాడు.
ఈ గ్రామంలో కనుగొనబడిన తూర్పు చాళుక్య విష్ణువర్ధన భల్మ I యొక్క మంజూరు. ఇది రాజవంశం యొక్క సాధారణ వంశావళిని ఇస్తుంది, రాష్ట్రకూట కృష్ణునితో సహా అతని డేక్లాడాస్ను జయించిన రాజు, ఎలమంచ కలిరిగదేశ, దేవరాష్ట్ర విషయంలో ఒక గ్రామాన్ని మంజూరు చేసాడు. మంజూరు అసంపూర్తిగా ఉంది. ఎలమంచిలి బహుశా రాజధాని కావచ్చు. గ్రాంట్ భవభక్టిస్ మాలతిమద్ధవ యొక్క చివరి పద్యం ఇస్తుంది, తద్వారా భవభూతి చాళుక్య భీముడు I కంటే ముందు జీవించాడని చూపిస్తుంది.[దేవరత్త విషయం అలహాబాద్ స్తంభ శాసనం ఓ సముద్రగుప్తులో ప్రస్తావించబడింది[7]
కశింకోట సంస్థానాన్ని చెలికాని కుటుంబం పాలించింది. వీరు రావు వారికి బంధువులు.[8] హవేలీ భూములతో ఏర్పడిన కశింకోట, మేలుపాక సంస్థానాలను వేలంలో విజయనగరం రాజు కొన్నాడు. రెండు సంవత్సరాల తర్వాత వాటిని కారుమంచి వెంకటాచలానికి అమ్మాడు. 1837లో ఆయన మరణించిన తర్వాత కూతురు కొడుకు మంత్రిప్రగడ వెంకటరావుకు సిద్ధించాయి. 1845లో ఆయన కూడా మరణించగా, వెంకటరావు తమ్ముడు చిరంజీవిరావు, కొడుకు వెంకటాచలానికి ఉమ్మడిగా కట్టబెట్టారు. ఇద్దరూ పిల్లలైనందువళ్ళ సంస్థానం సంరక్షక పాలనలో ఉంది. తమ్ముడు చిరంజీవిరావు 1851లో మరణించాడు, కొడుకు వెంకటాచలం 1863లో యుక్తవయస్కుడై 1865 మే నెలలో మరణించాడు. ఆయన మైనరు విధవ రామాయమ్మ, పసిపాప మహాలక్ష్మమ్మ.[9]
ఏనుగుల వీరాసామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో కశింకోట గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము:14 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కదికి 7 కోసులదూరములో నుండే కసంకోట అనేఊరు 9 గంతలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీఊరు వున్నది. పోలీసు అమీనున్ను40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి. కనంకోట యనే ఊరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే ఊరు 7 గంటలకు చెరినాను.
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల అనకాపల్లిలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విశాఖపట్నంలోను, పాలీటెక్నిక్ అనకాపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం అనకాపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విశాఖపట్నం లోనూ ఉన్నాయి.
కశింకోటలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలో11 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఏడు మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
కశింకోటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
కశింకోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
కశింకోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
కశింకోటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
కలప ఫర్నిచరు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.