కరొలైన్ ద్వీపం
From Wikipedia, the free encyclopedia
కరొలైన్ ద్వీపం దీనిని కరొలైన్ అటోల్ (మిలీనియం ద్వీపం, బెకిసా ద్వీపం అని కూడా అంటారు). అనే దీవి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ ద్వీపమాలికలలో భాగమైన కోరల్ దీవులకు తూర్పు దిక్కున ఉంది. దీనిని మొదటిసారిగా 1606 సంవత్సరంలో ఐరోపా వాసులు గుర్తించారు. ప్రపంచంలో కొబ్బరి పీతలు అత్యధికంగా ఉండే ప్రాంతంగా ఈ దీవి గుర్తించబడింది. ఈ దీవి జనావాసాలు లేని పగడపు అటాల్లకు తూర్పున ఉంది. మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దక్షిణ రేఖా ద్వీపాలలో ఇది భాగంగా ఉంది.
1606 లో ఈ దీవిని ఐరోపియన్లు మొదటిసారిగా చూశారు. 1868 లో యునైటెడ్ కింగ్డం దీనిని స్వాధీనం చేసుకుంది. 1979 లో ద్వీపం దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి కిరిబాటి రిపబ్లిక్కులో భాగంగా ఉంది. కరోలిన్ ద్వీపానికి దూరంగా ఉంది. ప్రపంచంలోని ప్రిస్టైన్ ట్రాపికల్ దీవులలో ఇది ఒకటిగా ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత సహజమైన ఉష్ణమండల ద్వీపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 19, 20 శతాబ్దాలలో మానవ నివాసం తరువాత గ్వానో మైనింగు, కొబ్బరి పంట ఈ దీవి ఆర్థికరంగానికి సహకారం అందిస్తున్నాయి. కొబ్బరి పీతలు అత్యధిక సంఖ్యలో ఉన్న దీవులలో ఇది ఒకటి. ఈ దీవి సముద్ర పక్షులకు ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశంగా (ముఖ్యంగా సూటీ టెర్ను) ఉంది.
ఈ అటాల్ ప్రస్తుతం వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించబడింది.[1] 2014 లో కిరిబాటి ప్రభుత్వం దక్షిణ లైన్ దీవులు (కరోలిన్ (సాధారణంగా మిలీనియం అని పిలుస్తారు), ఫ్లింట్, వోస్టాక్, మాల్డెన్, స్టార్బక్) చుట్టూ 12 నాటికల్-మైళ్ల ఫిషింగ్ మినహాయింపు జోన్ను ఏర్పాటు చేసింది.[2]
ప్రపంచంలో సంవత్సరంలో ఎక్కువ భాగం సూర్యరశ్మిని అందుకున్న ప్రాంతంగా అటోల్ ప్రసిద్ధి చెందింది. సహస్రాబ్ది వేడుకలలో దాని పాత్ర ప్రత్యేకత సంతరించుకుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ 1995 పునఃరూపకల్పన తరువాత క్యాలెండర్లో 2000 జనవరి 1 కి చేరుకున్న మొదటి ప్రదేశాలలో కరోలిన్ ద్వీపం ఒకటిగా నిలిచింది.