భారతదేశ నటుడు. నిర్మాత, కథకుడు From Wikipedia, the free encyclopedia
కరణ్ జోహార్ (జననం 25 మే 1972), (కె జో అని కూడా పిలుస్తారు).[3] ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, కాస్ట్యూం డిజైనర్, నటుడు, టివి ప్రముఖుడు. ప్రముఖ నిర్మాత యష్ జోహార్, హీరో జోహార్ ల కుమారుడు కరణ్.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా కూడా పరిచయమయ్యారు కరణ్. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు అందుకున్నారు. ఆ తరువాతా ఆయన దర్శకత్వం వహించిన కభీ ఖుషీ కభీ గమ్(2001), కభీ అల్విదా నా కెహ్నా(2006) సినిమాలు కూడా పెద్ద హిట్లే. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అయాన తీసిన మై నేం ఈజ్ ఖాన్(2010) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుని అవార్డు అందుకున్నారు ఆయన. తన తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్.
కరణ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత యష్ జోహార్, హీరో జోహార్ లకు ముంబైలో జన్మించారు. ముంబై లోని గ్రీన్ లాన్స్ హై స్కూల్ లోనూ, హెచ్.ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లోనూ చదువుకున్నారు ఆయన. ఫ్రెంచ్ భాషలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.[4] 1989లో దూరదర్శన్ లోని ఇంద్రధనుష్ సీరియల్ లో శ్రీకాంత్ పాత్రలో నటించారు కరణ్.
చిన్నప్పట్నుంచీ, సినిమాలకు ఆకర్షితుడైన కరణ్ రాజ్ కపూర్, యష్ చోప్రా, సూరజ్ బర్జత్యాలు తన ప్రేరణలుగా చెప్పుకుంటారు ఆయన.[5][6] కొంతకాలం న్యూమరాలజీని నమ్మిన కరణ్ కేవలం "K" అనే అక్షరంతో మొదలయ్యే పేర్లనే సినిమాలకు పెట్టేవారు. కానీ 2006లో వినోద్ చోప్రా నిర్మాణంలో వచ్చిన లగే రహో మునా భాయ్ సినిమాను చూసి, న్యూమరాలజీని నమ్మడం మానేశారు.[7]
నటునిగా
దూరదర్శన్ సీరియల్ ఇంద్రధనుష్(1989)లో -శ్రీకాంత్
దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే(1995) – రాకీ
మై హూ నా(2004)
హోమ్ డెలివరీ:ఆప్కో..ఘర్ తక్ (2005) – స్వంత పాత్ర
అలగ్(2006) – స్వంత పాత్ర
సలామ్-ఎ-ఇష్క్ (2007) – స్వంత పాత్ర
ఓం శాంతి ఓం(2007) – స్వంత పాత్ర
C Kkompany సి కెకొంపెనీ(2008) – గేమ్ షో హోస్ట్ పాత్ర