ఎస్.హెచ్.రజా
భారతీయ కళాకారుడు / From Wikipedia, the free encyclopedia
సయ్యద్ హైదర్ రజా (ఎస్.హెచ్.రజా) ( 1922 ఫిబ్రవరి 22 – 2016 జూలై 23) భారతీయ చిత్రకారుడు. ఆయన 1950 నుండి ఫ్రాన్స్లో నివాసముంటున్నాఅరు. ఆయనకు భారతదేశంతో బలమైన అనుబంధం ఉంది.[1]
పద్మవిభూషణ సయ్యద్ హైదర్ రజా | |
---|---|
జననం | (1922-02-22)1922 ఫిబ్రవరి 22 బబారియా, సెంట్రల్ ప్రోవిన్స్ అండ్ బేరర్ బ్రిటిష్ ఇండియా |
మరణం | 2016 జూలై 23(2016-07-23) (వయసు 94) న్యూఢిల్లీ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రంగం | చిత్రకారుడు |
అవార్డులు | పద్మవిభూషణ 2013 పద్మభూషణ 2007 లలిత కళా అకాడమీ ఫెలోషిప్ 1981 పద్మశ్రీ 1981 కమాండర్ ఆఫ్ లిగయాన్ హానర్ 2015 |
ఆయన భారతీయ భావనలను, ప్రతీకలను తన కుంచె ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు.[2][3] బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళాఖండాల ద్వారా ఆయన ప్రసిద్ధి పొందారు.[4] సులభంగా అర్థమయ్యే అమూర్త రేఖాగణిత శైలిలో ఆయన బొమ్మలు గీసేవారు. ఆయనకు 1981లో పద్మశ్రీ, లలిత కళా అకాడమీలో ఫెలోషిప్ లభించాయి.[5] 2007లో పద్మభూషణ పురస్కారాన్ని అందుకున్నారు.[6] 2013లో పద్మవిభూషణ పురస్కారాన్ని పొందారు.[7] 2015 జూలై 14లో ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం అయిన "కమాడియర్ డె లా లెగియన్ డి హోనర్" పురస్కారం పొందారు.[8]
ఆయన భారతదేశంలో ఖరీదైన నవీన చిత్రాలు వేసిన కళాకారునిగా 2010 జూన్ 10 న "సౌరాష్ట్ర" చిత్రం 16.42 కోట్లకు క్రిస్టిల్స్ వేలంపాటలో అమ్మడంద్వారా ప్రసిద్ధి పొందాడు.[9][10]
1959లో ఆయన ఫ్రెంచ్ కళాకారిణి జానినే మొంగిలాట్ ను వివాహమాడారు. కానీ ఆమె 2002లో క్యాన్సర్ వ్యాధితో మరణించింది. తరువాత ఆయన భారతదేశం తిరిగి రావడానికి నిర్ణయించాడు.[11][12]