ఎన్.ఆర్. నారాయణ మూర్తి
భారతీయ వ్యాపారవేత్త / From Wikipedia, the free encyclopedia
ఎన్.ఆర్.నారాయణ మూర్తి గా ప్రసిద్ధులైన నాగవర రామారావు నారాయణ మూర్తి (కన్నడ: ನಾಗವಾರ ರಾಮರಾಯ ನಾರಾಯಣ ಮೂರ್ತಿ) భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త, సాఫ్టువేరు ఇంజనీరు, ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్ కు అధికారంలో లేని అధ్యక్షుడు, ముఖ్య గురువు. ఆయన 1981 నుండి 2002 వరకు, 21 సంవత్సరాలు ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు. 2002లో CEOగా పదవీవిరమణ చేసిన తర్వాత, సంఘ సేవలకు, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేయటానికి తన కార్యకలాపాలను విస్తృతం చేసాడు. నారాయణ మూర్తి గారు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఆయన భారతదేశములోని రెండవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో కలిపి అనేక పురస్కారాలను అందుకున్నారు. 2009లో, ఆయన ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రసంగాలన్నీ ఎ బెటర్ ఇండియా: ఎ బెటర్ వరల్డ్ పుస్తకంగా ప్రచురితమయ్యాయి.[3]
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఎన్.ఆర్.నారాయణ మూర్తి | |
---|---|
జననం | (1946-08-20) 1946 ఆగస్టు 20 (వయసు 77) మైసూరు, కర్ణాటక |
వృత్తి | నాన్ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్, ఛీఫ్ మెంటార్, ఇన్ఫోసిస్ |
నికర విలువ | $3 billion USD (2020)[1] |
జీవిత భాగస్వామి | సుధా మూర్తి |
పిల్లలు | రోహన్, అక్షత [2] |
బంధువులు | రిషి సునాక్ (అల్లుడు) |