ఎం. భక్తవత్సలం
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
మింజిర్ భక్తవత్సలం లేదా మింజిర్ కనకసభాపతి భక్తవత్సలం (9 అక్టోబరు 1897 – 1987 ఫిబ్రవరి 13) భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. అతను 1963 అక్టోబరు 2 నుండి 1967 మార్చి 6 వరకు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలనందించాడు. అతను తమిళనాడు రాష్ట్రానికి చివరి భారత జాతీయకాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి. భక్తవత్సలం మద్రాసు రాజ్యంలో 1897 అక్టోబరు 9 న జన్మించాడు. అతను న్యాయవిద్యనభ్యసించి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసాడు. అతను పిన్న వయస్సులోనే రాజకీయాలలోకి ప్రవేశించి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. అతను ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. అతను 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. రాజాజీ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహించాడు. ఓ. పి. రామస్వామి రెడ్డియార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా తన సేవలనందించాడు.
మింజుర్ భక్తవత్సలం | |||
![]() సా.సం 1938 లో భారత జాతీయ కాంగ్రెస్ హరిపుర సెషన్ లో భక్తవత్సలం | |||
4వ మద్రాసు ముఖ్యమంత్రి | |||
---|---|---|---|
పదవీ కాలం 2 అక్టోబరు 1963 – 6 మార్చి 1967 | |||
ప్రధాన మంత్రి | జవహర్లాల్ నెహ్రూ , లాల్ బహదూర్ శాస్త్రి , ఇందిరా గాంధీ | ||
గవర్నరు | భిష్ణురాం మేధి , జయచామరాజ వొడెయార్ బహదూర్ , పి. చంద్రారెడ్డి (ఆపద్ధర్మ), సర్దార్ ఉజ్జల్ సింగ్ (ఆపద్ధర్మ), | ||
ముందు | కె. కామరాజ్ | ||
తరువాత | సి.ఎన్.అన్నాదురై | ||
ప్రజా పనులు, ప్రణాళికా శాఖామంత్రి (మద్రాసు రాజ్యం) | |||
పదవీ కాలం 24 మార్చి 1947 – 6 ఏప్రిల్ 1949 | |||
Premier | ఓ. పి. రామస్వామి రెడ్డియార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1897-10-09)1897 అక్టోబరు 9 | ||
మరణం | 1987 ఫిబ్రవరి 13(1987-02-13) (వయసు 89) చెన్నై , తమిళనాడు, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | జ్ఞానసుందరాంబల్ | ||
సంతానం | సరోజినీ వరదప్పన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అతను 1950లలో భారత జాతీయ కాంగ్రెస్ను నాయకత్వం వహించి, మద్రాసు రాజ్యానికి 1963 నుండి 1967 వరకు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు. 1967 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ ఓటమి తరువాత అతను రాజకీయాల నుండి పాక్షికంగా తప్పుకున్నాడు. అతను 1987 జనవరి 31న తన 89వ వయసులో మరణించాడు.