ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
భారతదేశం యొక్క రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఆంగ్లం : All India Majlis-e-Ittehadul Muslimeen) (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అర్థం: అఖిల భారత సమైక్య ముస్లిం మండలి) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని ప్రదేశాలలో బలమైన ఉనికి గల పార్టీ. 2004 లోక్సభ ఎన్నికలలో ఈ పార్టీ ఒక సీటు గెలుపొందింది. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఉన్నాడు. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ లోక్సభకు ఎన్నికయ్యాడు. అనంతరం తన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ کل ہند مجلس اتحاد المسلمين | |
---|---|
AAll India Majlis-e-Ittehadul Muslimeen logo.svg | |
నాయకత్వం | అసదుద్దీన్ ఒవైసీ |
వ్యవస్థాపన | బహాదుర్ యార్ జంగ్ |
స్థాపన | 1927 లో అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్ |
ప్రధాన కార్యాలయం | దారుస్సలాం బోర్డు హైదరాబాదు |
పత్రిక | ఇతేమాద్ డైలీ (ఉర్దూ దినపాత్రిక) |
సిద్ధాంతం | లౌకిక వాద ప్రజాస్వామ్యం |
రంగు | ఆకు పచ్చ |
తెలంగాణా అసెంబ్లీ | 7 / 119 |
మహారాష్ట్ర అసెంబ్లీ | 2 / 288 |
లోక్ సభ | 1 / 545 |
ఓటు గుర్తు | |
గాలిపటం | |
వెబ్ సిటు | |
http://www.aimim.in |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాదు నగర కార్పొరేషన్ లోని 100 స్థానాల్లో 36 స్థానాలు కలిగివున్నది.