శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)
భారతదేశంలోని కేరళలోని తిరువనంతపురంలో ఆలయం / From Wikipedia, the free encyclopedia
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, భారతదేశం, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెంకొర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది. మలయాళం, తమిళంలో 'తిరువనంతపురం' నగరం పేరు "ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత" అని అనువదిస్తుంది (అనంత విష్ణు రూపం).[1] [2]ఈ ఆలయం చేరా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండిటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది, ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది.[3][4] కొన్ని సంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లా లోని, కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది ("మూలస్థానం"), వాస్తుపరంగా కొంత వరకు, ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లా, తిరువత్తర్ లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం.[5] ప్రధాన దైవం పద్మనాభస్వామి (విష్ణువు), "అనంత శయన" భంగిమలో, అనంతమైన పాము ఆది శేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు.[6] పద్మనాభస్వామి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరునాళ్ రామవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త.on july 14th at 1:25pm the doors of 6th rooms are also opened by government of india by latest technology.
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ) | |
---|---|
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | కేరళ |
జిల్లా: | తిరువనంతపురం |
ప్రదేశం: | తిరువనంతపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | పద్మనాభుడు |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | క్రీ. శ.1568 |