కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం
ఆఫ్రికాలో ఒక దేశం / From Wikipedia, the free encyclopedia
కాంగో ప్రజాస్వామ్య గణతంత్రంని సాధారణంగా కాంగో అంటారు.[7][8] అనేది దక్షిణ ఆఫ్రికాలో దక్షిణాది దేశం. దీనిని కొన్నిసార్లు 1971 - 1997 మధ్య దాని అధికారిక నామం అయిన పూర్వపు పేరు జైయిరు అని కూడా అంటారు. డి.ఆర్.సి ఉత్తర సరిహద్దులో సెంట్రల్ ఆఫ్రికన్ గణతంత్రం, ఈశాన్య సరిహద్దులో దక్షిణ సుడాన్, తూర్పు సరిహద్దులో ఉగాండా, రువాండా, బురుండి, టాంజానియా, దక్షిణసరిహద్దులో జాంబియా, నైరుతి సరిహద్దులో అంగోలా, పశ్చిమ సరిహద్దులో కాంగో గణతంత్రం, అట్లాంటికు మహాసముద్రం ఉన్నాయి. వైశాల్యపరంగా ఇది ఉప-సహారా ఆఫ్రికాలో ఇది అతిపెద్ద దేశంగా ఉంది. ఆఫ్రికా దేశాలలో (అల్జీరియా తర్వాత) రెండవ స్థానంలో, ప్రపంచంలోని 11 వ స్థానంలో ఉంది. 78 million,[3] కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం అత్యధిక జనాభా కలిగిన ఫ్రాన్కోఫోన్ దేశం. ఆఫ్రికాలో అధిక జనసాంధ్రత కలిగిన దేశాలలో 4 వ స్థానంలో, ప్రపంచంలో 16 వ స్థానంలో ఉంది.
కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం République démocratique du Congo (French) Repubilika ya Kôngo ya Dimokalasi (Kongo) Republíki ya Kongó Demokratíki (Lingala) Jamhuri ya Kidemokrasia ya Kongo (Swahili) Ditunga dia Kongu wa Mungalaata (Luba-Katanga) | |
---|---|
నినాదం: "Justice – Paix – Travail" (French) "Justice – Peace – Work" | |
గీతం: Debout Congolais (French) "Arise, Congolese" దస్త్రం:National anthem of the Democratic Republic of the Congo.ogg | |
Location of కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం (dark green) | |
రాజధాని | Kinshasa 4°19′S 15°19′E |
అధికార భాషలు | French |
గుర్తించిన జాతీయ భాషలు |
|
జాతులు | See Ethnic groups section below |
పిలుచువిధం | Congolese |
ప్రభుత్వం | Unitary semi-presidential republic[1] |
• President | Félix Thisekedi |
• President Elect | Jean-Michel Sama Lukonde |
• Prime Minister | Bruno Tshibala |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | National Assembly |
Formation | |
• Colonised | 17 November 1879 |
• Congo Free State | 1 July 1885 |
• Belgian Congo | 15 November 1908 |
30 June 1960[2] | |
20 September 1960 | |
• Renamed to Democratic Republic of Congo | 1 August 1964 |
• Republic of Zaire | 29 October 1971 |
• Fall of Mobutu | 17 May 1997 |
• Current constitution | 18 February 2006 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,345,409 km2 (905,567 sq mi) (11th) |
• నీరు (%) | 3.32 |
జనాభా | |
• 2016 estimate | 78,736,153[3] (16th) |
• జనసాంద్రత | 34.83/km2 (90.2/sq mi) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $67.988 billion[4] |
• Per capita | $785[4] |
GDP (nominal) | 2017 estimate |
• Total | $40.415 billion[4] |
• Per capita | $446[4] |
జినీ (2006) | 44.4[5] medium |
హెచ్డిఐ (2018) | 0.470[6] low · 176th |
ద్రవ్యం | Congolese franc (CDF) |
కాల విభాగం | UTC+1 to +2 (WAT and CAT) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +243 |
ISO 3166 code | CD |
Internet TLD | .cd |
కాంగో బేసిన్లో కేంద్రీకృతమై డి.ఆర్.సి భూభాగంలో 90,000 సంవత్సరాల క్రితం సుమారు సెంట్రల్ ఆఫ్రికన్ దోపిడీదారుల చేత మొట్టమొదటిదిగా నివాసితప్రాంతంగా మారింది. 3,000 సంవత్సరాల క్రితం బంటు విస్తరణలో భాగంగా ఈ ప్రాంతానికి బంటు ప్రజలు వచ్చి చేరారు. పశ్చిమప్రాంతంలో కాంగో రాజ్యం 14 - 19 వ శతాబ్దాల్లో కాంగో నదీ ముఖద్వారం చుట్టూ పాలించింది. 16 వ , 17 వ శతాబ్దాల నుండి 19 వ శతాబ్దం వరకు మధ్య, తూర్పు ప్రాంతాలలో లూబా, లుండా రాజ్యాలు పాలించాయి. 1870 వ దశాబ్ధంలో ఆఫ్రికా పెనుగులాట ప్రారంభించే ముందు కాంగో ముఖద్వారంలో యూరోపియన్ అన్వేషణ మొదలైంది. బెల్జియం రాజు రెండవ లియోపోల్డు నిధి సహాయంతో హెన్రీ మోర్టన్ స్టాన్లీ నేతృత్వంలో మొదటి అన్వేషణ జరిగింది. 1885 లో బెర్లిను కాన్ఫరెన్సులో కాంగో భూభాగంపై లియోపోల్డు అధికారికంగా హక్కులను సొంతం చేసుకుని తన వ్యక్తిగత ఆస్తిగా చేసుకుని ఈ ప్రాంతానికి కాంగో ఫ్రీ స్టేట్ అని పేరు పెట్టారు. ఫ్రీ స్టేట్ సమయంలో వలస సైనిక విభాగం " ఫోర్స్ పబ్లికు " స్థానిక ప్రజలతో రబ్బరును ఉత్పత్తి చేయించింది. 1885 నుండి 1908 వరకు కాంగో ప్రజలు మిలియన్లసంఖ్యలో వ్యాధులు, బలవంతపు శ్రమదోపిడీ ఫలితంగా మరణించారు. 1908 లో బెల్జియం ప్రారంభ విముఖత ఉన్నప్పటికీ అధికారికంగా ఫ్రీ స్టేటును స్వాధీనం చేసుకుని దీనిని బెల్జియన్ కాంగోగా మార్చింది.
1960 జూన్ 30 లో కాంగో గణతంత్రం పేరుతో బెల్జియన్ కాంగో స్వాతంత్ర్యం పొందింది. కాంగో జాతీయవాద ప్యాట్రిస్ లుమెంబా మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. జోసెఫ్ కసా-వుబు మొదటి అధ్యక్షుడు అయ్యారు. భూభాగ పరిపాలనపై సంఘర్షణ చెలరేగింది. ఇది కాంగో సంక్షోభం అని పిలువబడింది. మోయిస్సోషోబ్, సౌత్ కసాయి నేతృత్వంలోని కటాంగా ప్రాంతాలు విడిపోవడానికి ప్రయత్నించాయి. సంక్షోభంలో సహాయం కోసం లుమెంబా సోవియట్ యూనియనుకు మారిన తరువాత యు.ఎస్ బెల్జియస్ జాగరూకతతో సెప్టెంబరున 5 కాసా - వుబు ద్వారా తొలగించి 1961 జనవరి 17 న బెల్జియన్ నేతృత్వంలోని కటాన్గీస్ దళాల సాయంతో లుమెంబాకు మరణశిక్ష అమలైంది. 1965 నవంబరు 25 న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జోసెఫ్-డెసిరె మోబుటు (తర్వాత అతను స్వయంగా మొబూటు సేస్ సేకో పేరు మార్చారు) తిరుగుబాటు ద్వారా అధికారికంగా పదవీబాధ్యతలు చేపట్టాడు. 1971 లో అతను దేశం పేరును జైయిరుగా మార్చాడు. ప్రజా ఉద్యమం విప్లవంతో చట్టబద్ధమైన ఏకైక పార్టీ దేశంలో నియంతృత్వ పాలన కొనసాగింది. కమ్యూనిస్ట్ వ్యతిరేక వైఖరి కారణంగా మోబుటు ప్రభుత్వం ప్రచ్చన్న యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ నుండి గణనీయమైన మద్దతు పొందింది. 1990 ల ప్రారంభంలో మొబూటు ప్రభుత్వం బలహీనపడటం ప్రారంభించింది. తూర్పు ప్రాంతంలో అస్థిరత కారణంగా 1964 లో రువాండన్ జాతి నిర్మూలన హత్యలు సంభవించాయి. 1996 రువాండా పాట్రియాటిక్ నేతృత్వంలో బాన్మములేగే (కాంగోలస్ టుట్సి) ప్రజలు ముట్టడి చేయడానికి ఈ పరిస్థితులు దారి తీసాయి. మొదటి కాంగో యుద్ధాన్ని ప్రారంభంగా భావించబడింది.[2] 1997 మే 17 న మొబూటు మొరాకోకు పారిపోయాడు. దేశం పేరును "కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం" గా మార్చిన తరువాత దక్షిణ కివూ ప్రావిన్సుకు చెందిన టుట్సీ దళాల నాయకుడైన లారెంట్-డిసిర కాబిలా అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడు కబిలా, రువాండా, దేశంలోని టుట్సీల మధ్య ఉద్రిక్తతల కారణంగా 1998 నుండి 2003 వరకు రెండో కాంగో యుద్ధం జరగడానికి దారితీశాయి. అంతిమంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలు, ఇరవై సాయుధ సమూహాలు యుద్ధంలో పాల్గొన్నాయి.[9] దీని ఫలితంగా 54 లక్షల మంది ప్రజలు మరణించారు.[10][11][12][13] ఈ రెండు యుద్ధాలు దేశాన్ని నాశనం చేసాయి. 2001 జనవరి 16 న అధ్యక్షుడు లారెంట్-డిసిరబుల్ కాబిలాను అతని అంగరక్షకులలో ఒకరు హతమార్చాడు. ఎనిమిది రోజుల తరువాత అతని కుమారుడు జోసెఫ్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
కాంగో ప్రజాస్వామ్య గణతంత్రంలో సుసంపన్నమైన సహజ వనరులు ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత, మౌలికవసతులు లేకపోవటం, అవినీతి వంటి సమస్యలు ఉన్నాయి. శతాబ్ధాలుగా వాణిజ్యపరంగా, కాలనియల్ అత్యుపయోగం, దోపిడీ కారణంగా కొద్దిపాటి అభివృద్ధి మాత్రమే సాధ్యం అయింది. రాజధాని కిన్షాసాతో పాటు, రెండు అతిపెద్ద నగరాలు లుబంబషి, మొబిజి-మాయిలు రెండు మైనింగ్ కమ్యూనిటీలుగా ఉన్నాయి. 2012 లో కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం అతిపెద్ద ఎగుమతి అయిన ఖనిజాలలో 50% చైనా దిగుమతి చేసుకుంటున్నది. 2016 లో DR కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం మానవాభివృద్ధి స్థాయి 187 దేశాలలో 176 వ స్థానాన్ని పొందింది.[6] As of 2018[update] 2018 నాటికి దాదాపు 6,00,000 కాంగోలు కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం పొరుగున మధ్య, తూర్పున ఉన్న దేశాలకు పారిపోయారు.[14] ఫలితంగా రెండు మిలియన్ల మంది పిల్లలు ఆకలితో బాధపడ్డారు. యుద్ధంలో 4.5 మిలియన్ల మంది పౌరులు నివాసాల నుండి తరలించబడ్డారు.[15] సార్వభౌమ రాజ్యంగా ఇది ఐక్యరాజ్యసమితి, నాన్-అలైన్మెంటు మూవ్మెంటు, ఆఫ్రికన్ యూనియన్ , కొమేసాలో సభ్యదేశంగా ఉంది.