మహావాక్యము
From Wikipedia, the free encyclopedia
వేద-వేదాంగములు ఉద్భవించి జ్ఞాన పరిమళాలు నలు దిక్కులా వెదజల్లిన పుణ్యభూమి మన భరతభూమి. అందుకనే భారత భూమిని వేదభూమి అని కర్మభూమి అని అంటారు. ఋషుల తమ ఉపాసనా బలముతో దివ్య దృష్తితో అనంత విశ్వము నుంచి గ్రహించిన మహిమాన్విత నిత్యసత్యాల సమాహారమే మన వేదములు. అందువల్లనే ఋషులను వేద ద్రష్టలు అని అంటారు. భూమి మీద నివసిస్తున్న మానవులకు నాగరికతను, జీవన విధానాన్ని, మానవుని లేక జీవుని అత్యున్నత మైన పరమావధి ఏమిటి అని నేర్పిన తొలి విజ్ఞాన శాస్త్రాము మన వేదములు. జిజ్ఞాసువులకు, ముముక్షులకు సులభగ్రాహ్యంగా నుండుటకు సాక్షాత్ విష్ణుస్వరూపుడయిన బాదరాయణుడు (వ్యాస భగవానుడు) వీటిని నాలుగు భాగాలుగా విభజించారు. అందువల్లనే వీరికి వేదవ్యాసుడు అని పేరు కూడా వొచ్చింది. ప్రకృతిలో భాగమైన మన విద్యుక్త కర్తవ్యాన్ని ధర్మాన్ని ప్రబోధించి, జీవన్ముక్తుని పొందే మార్గమును తెలియ పరచినవి యీ వేదములు. అనేక జన్మల పాప పరిహారమును పరిహరించుకొనే మార్గము చూపి. వర్ణాశ్రమాల యొక్క ఔచిత్యాన్ని మనకు బోధించి, ఒక వర్గము వేరొక వర్గము పై ఆధారపడి పరస్పర సహాయ సహకారములు అందిచేవి అని విశ్లేషించినవి. చిత్రమైన ఆత్మజ్ఞానమును మానవాళికి పరిచయం చేసి. లౌకిక చింతన ఒకవైపు చేస్తూ పరమాత్మను చేరుకునే విధానాలను విశదీకరించి మనకు అందించే ప్రయత్నము చేసాయి వేదములు. ఆత్మచింతన చేస్తూనే మానవశ్రేయస్సు కొరకు చేయవలసిన కర్మలను నిర్దేశించి. నైతిక ధార్మిక జీవన విధానమును ప్రోత్సహించి. పర బ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థమని దాని నుండే ఈ విశ్వమంతయు ఆవిర్భవించినది అని గొప్ప వైజ్ఞానిక అంశాన్ని ఏనాడో మనకు చాటి చెప్పాయి. ఈ శుద్ధ చైతన్య పదార్థమునకు దేశ, కాల, వస్తు పరిస్చ్చేదములు ఉండవని ఏనాడో నిర్ధారించి మనకు జ్ఞాన బోధ చేసాయి వేదములు. ఆత్మజ్ఞాన బోధనలో భాగంగా ప్రతి వేదము యొక్క సారాంశాన్ని ఆయా వేదముల అంతములో వేదాంతములు అనే పేరుతొ ఉపనిషత్తుల ద్వారా మనకు అందించాయి. ఉన్న అన్ని ఉపనిషత్ ల సారాంశాన్ని జిజ్ఞాసువులకు, ముముక్షులకు సులభంగా ఆర్థం అగుటకు కేవలం నాలుగు మహా వాక్యములుగా జేసి మనకు తెలియ జేస్తున్నాయి.