దర్యాగంజ్
మధ్య ఢిల్లీ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం / From Wikipedia, the free encyclopedia
దర్యాగంజ్, గోడల నగరంగా పేరొందిన ఢిల్లీ పొరుగుప్రాంతమైన షాజహానాబాద్ (పాత ఢిల్లీ) పరిసరాలలో ఉన్న ఒక పట్టణం. "దర్యా" అనే పదం "నది" గోడల నగరానికి వెలుపల ఉన్న యమునా నదిని సూచిస్తుంది. దర్యాగంజ్ మూడు ఉప విభాగాలలో ఒకటి.ఇది మధ్య ఢిల్లీ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం ముఖ్య పట్టణం.ఈ ప్రాంతం ఎర్రకోట వైపు వెళ్ళే నేతాజీ సుభాష్ రోడ్ అంచున ఉన్న ఢిల్లీ గేట్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.
దర్యాగంజ్
దర్యాగంజ్ | |
---|---|
ఉప జిల్లా | |
Coordinates: 28.6443°N 77.2420°E / 28.6443; 77.2420 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | మధ్య ఢిల్లీ |
Government | |
• Body | ఢిల్లీ మహా నగరపాలక సంస్థ |
Population | |
• Total | 2,71,108 |
భాషలు | |
• అధికార | హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పంజాబీ |
Time zone | UTC+05:30 |
పిన్కోడ్ | |
స్థానిక స్వపరిపాలన | నగరపాలక సంస్థ |
1803 తరువాత దర్యాగంజ్ ప్రాంతంలో ఢిల్లీ కంటోన్మెంటుకు చెందిన ఢిల్లీ గార్సిన్ స్థానిక రెజిమెంట్ ఉంచబడింది.దీనిని ఆ తరువాత రిడ్జ్ ప్రాంతానికి మార్చారు.ఇప్పుడు దీనిని న్యూ దర్యాగంజ్ అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు బ్రిటిష్ దర్యా గంజ్ కంటోన్మెంట్లో భాగంగా ఉంది.పాత ఢిల్లీలోని బ్రిటిష్ వారి తొలి స్థాపనలలో ఇది ఒకటి.ప్రస్తుత వ్యాపారులు ఈ ప్రాంతంలోకి మారినప్పుడు, కొత్త దర్యాగంజ్ లోని మార్కెట్ ప్రాంతాన్ని "ఫైజ్ బజార్ " అని పిలువబడేది.[1] దర్యాగంజ్ కు తూర్పున యమునా నదిపై గోడల నగరానికి చెందిన రాజ్ ఘాట్ గేట్ వద్ద ధర్యాగంజ్ ప్రారంభమైంది.దర్యాగంజ్ ఫూల్ మండి (ఫ్లవర్ మార్కెట్) 1869 లో స్థాపించబడింది.నేటికీ ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పటికీ, ఆ ప్రాంతంలో జనాభా రద్దీ కారణంగా దీనికి చాలా ప్రాముఖ్యతను కలిగిఉంది.[2][3] 1911 తరువాత కొత్త రాజధాని న్యూ ఢిల్లీ నిర్మిస్తున్నప్పుడు, కొత్త నగరానికి మధ్య పహర్గంజ్తో పాటు, దర్యాగంజ్ ఈ రెండూ జనావాసం రద్దీలేని ప్రాంతాలుగా ఉండేవి.1931 నాటికి "గోడల నగరం" గా పిలవడం ప్రారంభించిన తరువాత పాత నగరం దిల్లీ గేట్ సమీపంలో గోడల నగరం అంచువరకు దర్యాగంజ్ బాగా విస్తరింపబడింది.[4]