చాముండేశ్వరి దేవాలయం (మైసూరు)
From Wikipedia, the free encyclopedia
చాముండేశ్వరి దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కుల దేవతగా ఆరాధీస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు.
త్వరిత వాస్తవాలు చాముండేశ్వరి దేవాలయం, పేరు ...
చాముండేశ్వరి దేవాలయం | |
---|---|
పేరు | |
స్థానిక పేరు: | చాముండేశ్వరి దేవాలయం |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | కర్నాటక |
జిల్లా: | మైసూరు |
ప్రదేశం: | మైసూరు |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | చాముండేశ్వరి |
మూసివేయి