కారన్ వాలీసు
బ్రిటీష్ వలసరాజ్య అధికారి, దౌత్యవేత్త / From Wikipedia, the free encyclopedia
ఛార్ల్సు కారన్ వాలీసు(1738-1805) (Charles Cornwallis) బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అనుసంస్థకు భారతదేశమందు 1786 లో గవర్నరు జనరల్ గా నియమించబడిన దొర. 1743- 1785 మధ్య రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సులు బ్రిటిష్ ఇండియా స్థాపనకు తొలిదశల్లో వేసిన పునాదులపై ముందుకు సాగిన కారన్ వాలీసు కుతంత్రములకు పాల్పడకుండానే బ్రిటిష్ ఇండియానిర్మాణములో ప్రముఖ పాత్రవహించాడు. భారతీయులను స్వపరిపాలనచేసుకునే స్తోమత లేనివారిగా పరిగణించి, కంపెనీ ఉద్యోగమునకు కేవలం దొరలే అర్హులను సూత్రముకల దొరలలో కారన్ వాలీసొకడని చెప్పవచ్చును. వారన్ హేస్టింగ్సు కలకత్తాలో సివిల్ క్రిమినల్ అప్పీలు కోర్టులు స్థాపించి న్యాయవ్యవస్థ, సంస్కరణలను మొదలు పెట్టగా కారన్ వాలీసు భూముల సిస్తులు, సివిల్ దావాల విచారణపధ్ధతులందుగూడా మార్పులచేసి జిల్లాలో క్రింది కోర్టులను స్థాపించాడు. కారన్ వాలిసు కార్యకాలములో జిల్లాకోర్టుల స్థాపన, దేశ పరిపాలనకు చేసిన నిబంధనలు, సంస్కరణములతో బ్రిటిష్ కంపెనీ వారు వంగరాష్ట్రములో నేరవిచారణ అధికారము తొలిసారిగా స్వీకరించారు. 1792 లో టిప్పుసుల్తానుతో మైసూరులో విజయవంతంగా మూడవ మైసూరు యుద్ధము చేసి మైసూరు రాజ్యములోని పెద్ద భూభాగములను బ్రిటిష ఇండియాలో కలుపుకున్నందుకు మార్క్విస్ అను ప్రభువు బిరుదివ్వబడింది. సా.శ. 1599 లో స్థాపింపబడి, భారతదేశానికి వ్యాపార నిమిత్తమువచ్చిన బ్రిటిష్ ఈస్టు ఇండియా సంస్థ భారతదేశములో వలస రాజ్యస్ధాపన రాజ్యతంత్రములద్వారా సాధించింది. 1707 లో ఔరంగజేబు చనిపోయిన తరువాతనుంచీ మొగల్ సామ్రాజ్య అస్తమయం, బ్రిటిష సామ్రాజ్యోదయం క్రమేణ కార్యరూపముదాల్చినవి. 1757 ప్లాసీ యుధ్ధమందు కుటిలోపాయములతో సాధించిన విజయముతో వంగరాష్ట్రము పూర్తిగా వారి వశమై 1765నుంచి రాజస్వహక్కు(దివానీ గిరి) కూడా లభించటంతో బ్రిటిష్ వారి రాజ్యస్థాపన అంకురార్పణమైనదని చెప్పవచ్చు. దేశీయ పరిపాలకులు అంతఃకలహములతో బ్రిటిష్ సంస్థ వారి రాజతంత్రములకులోనై బ్రిటిష్ రాజ్యస్థాపనకు తోడ్పడ్డారు. దేశసంపద, దేశాదాయము వారి వశమైనవి. స్వతంత్ర భారతదేశము 1858కల్లా బ్రిటిష్ ఇండియాగా మార్చబడి1947 దాకా బ్రిటిష్ రాజ్యాంగమునకు లోబడింది. అట్టి విసిష్ట బ్రిటిష్ ఇండియా చరిత్రలో 1786 -1793 మధ్య బ్రిటిష్ ఇండియా నిర్మాణమునకు కారన్ వాలీసు వహించిన పాత్ర ప్రముఖమైనది.[1][2]
His Excellency General The Most Honourable The Marquess Cornwallis KG | |
---|---|
Governor-General of the Presidency of Fort William | |
In office 12 September 1786 – 28 October 1793 | |
చక్రవర్తి | George III |
అంతకు ముందు వారు | Sir John Macpherson, Bt As Acting Governor-General |
తరువాత వారు | Sir John Shore |
In office 30 July 1805 – 5 October 1805 | |
చక్రవర్తి | George III |
అంతకు ముందు వారు | The Marquess Wellesley |
తరువాత వారు | Sir George Barlow, Bt As Acting Governor-General |
Lord Lieutenant of Ireland | |
In office 14 June 1798 – 27 April 1801 | |
చక్రవర్తి | George III |
ప్రధాన మంత్రి | William Pitt the Younger |
అంతకు ముందు వారు | The Earl Camden |
తరువాత వారు | The Earl Hardwicke |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Charles Edward Cornwallis V (1738-12-31)1738 డిసెంబరు 31 Grosvenor Square Mayfair, London, England |
మరణం | 1805 అక్టోబరు 5(1805-10-05) (వయసు 66) Gauspur, Ghazipur Kingdom of Kashi |
జాతీయత | British |
జీవిత భాగస్వామి | Jemima Tullekin Jones |
సంతానం | Mary, Charles |
కళాశాల | Eton College Clare College, Cambridge |
వృత్తి | Military officer, Colonial administrator |
పురస్కారాలు | Knight Companion of The Most Noble Order of the Garter |
సంతకం | |
Military service | |
Allegiance | Kingdom of Great Britain (1757–1801) United Kingdom (1801–1805) |
Branch/service | British Army British East India Company |
Years of service | 1757–1805 |
Rank | General |
Commands | India Ireland |
Battles/wars | Seven Years' War American War of Independence Third Mysore War Irish Rebellion of 1798 |